Sunday, June 13, 2010

మనస్సాక్షి

బోసి నవ్వుల పాప లతో ఆటలడునప్పుడు
లోపలి నుండి వినిపిస్తోంది ఏదో స్వరం...
వయసుమళ్ళిన ముసలి తాత ముఖం లో లేదు
బోసి నవ్వుల పసిపాపల నవ్వు లో ఉన్న వరం...
ఏమి జరిగింది ఈ ప్రయాణం లో
కళ్ళలోని మెరుపు దైన్యం గా మారింది..
స్వచ్చమైన ఆ నవ్వు జీవం లేనిది ఐంది...
ఈ ప్రయాణం అంతా ధనం వెనకే కదా...?
ఇప్పటికి, అప్పుడప్పుడు వినిపిస్తుంది ఓ స్వరం
అది గర్జిస్తున్నప్పుడు మనిషి మనిషి లా బ్రతుకుతాడు
అది మూలుగుతున్నప్పుడు మనిషి ని మనిషిగా బ్రతకనివ్వదు..
ఏంటి ఈ జీవితం పరుగంతా ధనం కోసమేనా..?

No comments:

Post a Comment